రాజకీయ నాయకుల విమర్శలకు పరిమితులు లేవా ?
రాజకీయ నాయకుల విమర్శలకు పరిమితులు లేవా ? : 24/7 న్యూస్ ఛానెల్స్ వచ్చిన కొత్తలో అందరూ సంతోషించారు. రాజకీయ నాయకుల మీద నిరంతర నిఘా ఉంటుంది వారి నిబద్ధత, బాద్యత పెరుగుతాయి అనుకున్నారు. కానీ ప్రస్తుత టివి చర్చల స్థాయి చాలా దారుణంగా ఉంది. ఈ విషయంలో తప్పు ఎవరిది ? పార్టీలదా ? పార్టీ అధ్యక్షులదా ? లేక టీవీ యాంకర్లదా ? వీళ్ళలో ఎవరూ తక్కువ వాళ్ళు కాదు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా తయారయ్యింది ఈ వ్యవహారం. పరుష పదజాలం మాట్లాడే వారిని పార్టీలు కట్టడి చేయకపొగా ప్రోత్సహిస్తున్నాయి. టీవీ చానెళ్లు కూడా వారి టీఆర్పీల కోసం అలంటి వారిని డిబేట్లకి పిలుస్తున్నాయి. ఇటీవల వల్లభనేని వంశి - బాబు రాజేంద్రప్రసాద్ల మధ్య tv9 ఛానెల్లో జరిగిన చర్చ వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారింది. టీ స్టాళ్లలో జరిగే చర్చలు ఇంతకన్నా మెరుగు అన్న స్థాయిలో వారి చర్చ సాగింది. ఇదే వల్లభనేని వంశి గన్నవరం వైసిపి అభ్యర్థిని బెదిరించినపుడు టిడిపి వాళ్ళు అతన్ని హీరో అన్నారు, వైసిపి వారు అతనికి ప్రజాస్వామ్య విలువలు తెలియవు అని విమర్శించారు. ఇవాళ టీడీపీ వాళ్ళు వంశి భాషని విమర్శిస్తుంటే వైసిపి వారు సమర్థిస్తున్నారు. బాబు రాజేంద్